హేమ‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు.. ఎందుకో తెలుసా?

-

తెలుగులో స్టార్‌ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పేరుతెచ్చుకుంది న‌టి హేమ‌. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మ‌రోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా మారింది ఈ నటి. హేమ‌కు పాలిటిక్స్ కొత్తేమి కాదు. త‌న‌కు ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక ఉంద‌ని కొన్ని సార్లు ఓపెన్ గా చెప్పింది ఈమె. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో జాయిన్ అయిన హేమ‌.. త‌రువాత రాజకీయాలను విరమించుకుని, సినిమాల్లో బిజీపోయింది. ఇక తాజాగా తిరుపతి ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది ఈ న‌టి.



ఈ నెల 14న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ త‌ర‌ఫున రత్నప్రభని గెలిపించాలంటూ హేమ ప్రచారం చేసింది. ప్ర‌చారంలో భాగంగా ఓ స‌భ‌లో మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. నెటిజ‌న్లు ట్రోలింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ‘మీరు అందరూ ఓటు వేసి ఎంపీ అభ్యర్థి రత్నప్రభను అసెంబ్లీకి పంపండిస అంటూ హేమ ఆవేశంగా చేసిన కామెంట్లు నెటిజ‌న్ల కంట ప‌డ్డాయి.

అంతే ఇక‌.. ఈ మాటలే ఆమెను అడ్డంగా బుక్ చేసేశాయి. ‘ఎంపీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలా అక్కా.’ అంటూ నెటిజన్లు సోష‌ల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఆమె మాట‌ల‌ను ట్రోలింగ్ చేస్తూ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నారు. హేమ రాజకీయాలు కూడా అనేక రకాలుగా మలుపు తిరిగింది. జై సమైక్యాంధ్ర పార్టీ దుకాణాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తేసిన తరువాత.. సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరింది. కానీ వైఎస్సార్సీపీలో ఆమె జూనియర్ ఆర్టిస్ట్ రేంజ్ లోనే మిగిలిపోయింది. దాంతో ప్రస్తుతం బీజేపీకి సపోర్ట్ చేస్తూ.. ప్రచారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news