ఏపీలో త‌గ్గిన క‌రోనా.. నేడు మూడు కేసులే

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లోనే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో కేవ‌లం 3 కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. గ‌త కొద్ది రోజుల క్రితం కేవ‌లం ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు అయింది.

ఈ రోజు మూడు కేసులు మాత్ర‌మే నిర్ధార‌ణ అయ్యాయి. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఐదు లోపే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు రాష్ట్రంలో 20 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కేవ‌లం 70 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఈ రోజు కూడా క‌రోనా మర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,121 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news