ఇక రేప్ చేస్తే 21 రోజుల్లో మరణ శిక్ష… జగన్ సర్కార్ సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేకంగా మహిళల భద్రతే లక్ష్యంగా పలు బిల్లులకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష విధిస్తూ ఆమోదం తెలిపింది.

నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు, వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి, 14 రోజుల్లో విచారణ పూర్తి, మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ తో… ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లుని కేబినేట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ బిల్లు మంత్రి వర్గం ఆమోదించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు ఆమోద ముద్ర పడింది.

కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే కఠిన చర్యలకు ఆమోద ముద్ర పడింది. సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు పొందుపరిచారు. మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష.. విధించనున్నారు. మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ చర్యలు వర్తిస్తాయి. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద చర్యలు.ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. పోస్కోచట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష.. విధిస్తారు. ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలు పొందుపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news