హత్యా.. ఆత్మహత్యా.. నవ దంపతులు సజీవ దహనం..!!

-

కారులో మంటలు చెలరేగటంతో నవ దంపతులు సజీవ దహనమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మంటల్లో కాలిపోతున్న కారును స్థానికులు గుర్తించారు. ఈ మేరకు స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు బెంగళూరులోకి ఆర్‌టీ నగర్‌కు చెందిన యశ్వంత్ (23), జ్యోతి (23)గా గుర్తించారు. అయితే ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నవ దంపతులు
నవ దంపతులు

బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన ఈ నవ దంపతులు మే 18వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయారు. ఇద్దరు తమ తమ కుటుంబాల్లో ఇంటర్వ్యూకి అని, కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి బయటికి వెళ్లారు. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హెబ్బల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉడుపి వద్ద కాలిపోతున్న కారులో స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news