చివరకు మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిన ప్రేమ వివాహం…!

-

ఓ జంట మొదట గాఢంగా ప్రేమించుకున్నారు, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి వివాహం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది. కొద్దిరోజులకే ఆ నవదంపతులు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… విశాల్, నిషా గౌతం ఇరువురు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారు సంసార జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టినవారు ఏం జరిగిందో తెలియదు కానీ విశాల్ గురువారం నాడు వారిద్దరూ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించారు.

suicidethinkphotos
suicidethinkphotos

ఇక ఆ తర్వాతి రోజు నిషా తల్లిదండ్రులు ఆమెను వారి అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి తీసుకువెళ్లారు. అయితే వివాహం జరిగిన కొద్దిపాటి రోజులకి తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో నిషా కూడా తీవ్ర మనస్థాపానికి గురి అయింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఎంతో చెప్పి ఓదార్చిన చివరికి రాత్రి సమయంలో తన గదిలోని పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news