ఈరోజు నుంచి కొత్త రూల్స్…ఏయే అంశాలు మారుతున్నాయి చూసేయండి మరి..!

-

ప్రతీ నెలా కూడా కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. ఈ నెల కూడా కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయి. అయితే మరి ఈరోజు నుండి ఏయే అంశాలు మారనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. కార్ల ధరల నుండి బ్యాంకుల వరకు చాలా రూల్స్ వచ్చాయి.

కార్ల ధరలు ని పెంచింది టాటా మోటార్స్. కొత్త ధరలు 2023 ఫిబ్రవరి 1 నుంచి అమలు లోకి వచ్చాయి. డీజిల్, పెట్రోల్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.2 శాతం వరకు పెంచింది.
అలానే నేటి నుండి గోవా వెళ్ళేవాళ్ళకి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. గోవా వెళ్లే ఇకపై అలర్ట్‌గా ఉండాలి. బీచ్‌లో ఇతరుల అనుమతి లేకుండా వాళ్ళ ఫోటోస్ ని క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా ఫారినర్స్ ఫోటోలు క్లిక్ చేసి ఇబ్బంది పెట్టద్దు. అలానే బీచ్‌లో మద్యం సేవించకూడదు. వంటలు చేసుకోకూడదు. ఈ కొత్త రూల్స్ ని ఫాలో అవ్వకపోతే రూ.50,000 ఫైన్ కట్టాలి.
అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె కడితే కనుక 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలానే ఫిబ్రవరి 13 నుంచి కెనరా బ్యాంక్ ఛార్జీలు పెంచనుంది
ఫిబ్రవరి 1న గ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా మార్పు రావచ్చు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
ఆర్బీఐ మరోసారి కీలక రెపో రేటు పెంచే ఛాన్స్ వుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేటి నుంచి రుణ రేట్లు ని పెంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news