చిత్తూరు జిల్లాలో విషాదం..భారీ వర్షానికి నవ వధువు మృతి..!

-

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి శ్రీవారి దర్శనానికి వచ్చిన నవ వధువు మృతి చెందింది. కర్ణాటకకు చెందిన ఓ పెళ్లి బృందం వివాహం అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో పాటు కాలువలు పోంగిపొర్లాయి. అయితే అదే సమయానికి తిరుపతి బాలాజీ కాలనీ నుండి ఎంఆర్ పల్లి కి వెళ్లే దారిలో వెస్ట్ చర్చ్ బ్రిడ్జ్ నీట మునిగి పోయింది.

అయితే దానిని గమనించకుండా పెళ్లి బృందం సుమా అదే దారిలో వెళ్ళింది. వరద నీటిని గమనించకుండా వెళ్లడంతో పెళ్ళి బృందం సుమో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో ఉన్న డ్రైవర్ ఇతర సభ్యులు బయటపడగా నవవధువు సంధ్య అందులోనే చిక్కుకుంది. దాంతో ఊపిరాడక సంధ్య మృతి చెందింది. ఇక వాహనంలోని ఇతరులను స్థానికులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్పించారు. నవ వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news