పెళ్లైన తొమ్మిది రోజులకే విషాదం.. ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

-

పెళ్లైన తొమ్మిది రోజులకే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నవ వధూవరులు హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరుడు మృతి చెందగా తీవ్ర గాయాలైన వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లేకలేక కలిగిన తమ కుమారుడికి ఇటీవలే ఘనంగా పెళ్లి చేశామని.. ఇంతలోనే ఈ విషాదం తమ జీవితాల్లో తీరని ఆవేదన మిగిల్చిందని వరుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన వీరభద్రం(25) వీరభద్రం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ఉన్న రిలయన్స్‌ జియో డిజిటల్‌ స్టోర్‌లో పని చేస్తాడు. వీరభద్రం పెళ్లికి వారం రోజుల ముందే సెలవు పెట్టాడు. పెళ్లి జరిగి వారం రోజులు అవుతుందని విధుల్లో చేరేందుకు హైదరాబాద్‌కు భార్య ప్రణీతతో కలిసి ఆత్మకూరు(ఎస్‌) నుంచి సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి ద్విచక్రవాహనం టోల్‌గేట్‌ బోర్డును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వీరభద్రం మెడ పైభాగంతో పాటు ఇతర చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. భార్య ప్రణీతకు చేయి విరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా వీరభద్రం అప్పటికే మృతి చెందాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. వీరభద్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news