`రేప్‌ జ‌రిగితే అప్పుడు రా చూద్దాం` అన్న పోలీసు.. ఎక్క‌డంటే..?

-

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని తగలబెట్టి 36 గంటలు గడిచాయో.. లేదో.. మరో బాధిత మహిళ పట్ల పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తనను అటకాయించిన కొందరు అత్యాచారం చేయాలని చూశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువతి, స్టేషన్ లో తీవ్ర అవమానానికి గురైంది. తాను మందుకు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా, ఐదుగురు దారికాసి అత్యాచారం చేయాలని చూశారని చెప్పిన ఆమె, ముగ్గురి పేర్లను కూడా చెప్పింది.

దీనిపై కేసునమోదుకు అంగీకరించని పోలీసులు, అత్యాచారం జరుగలేదుగా అని అవమానించారు. ఆపై రేప్ జరిగిన తరువాత రావాలని, అప్పుడు కేసు పెడతామని అన్నారని బాధితురాలు వాపోయింది. ఘటన జరిగిన వెంటనే తాను 1090కి ఫోన్ చేస్తే, వారు 100కు కాల్ చేయాలని చెప్పారని, 100కు ఫోన్ చేస్తే, ఘటన ఎక్కడైతే జరిగిందో, ఆ పరిధిలో ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారని ఆమె వెల్లడించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news