నిత్యానంద స్వామిజీకి షాక్, రేప్ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్

-

నిత్యానంద స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే.. నిత్యానంద స్వామికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగుళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారం ఇష్యూ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని 2019లో కోర్టు సమన్లు జారీ చేసింది.

అయితే, ఆయన ఎక్కడున్నాడో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆయన దేశం విడిచిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో, బాధితులు కోర్టుకు తమ ఆందోళనను తెలియజేశారు. దీంతో, కోర్టు నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

మరోవైపు నిత్యానంద ‘కైలాస’ అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కైలాస దేశం ఎక్కడుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈక్వేడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్ ఖండించింది. మరోవైపు నిత్యానంద చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాను బతికే ఉన్నానని, వైద్య చికిత్స పొందుతున్నానని నిత్యానంద వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news