ప్రభాస్ రూట్ లోనే నితిన్.. ఇటలీకి పయనం..!

-

ప్రస్తుతం యువ హీరో నితిన్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. భీష్మ సినిమాతో సక్సెస్ మూడ్ లో ఉన్న నితిన్ అదే జోష్ కొనసాగిస్తూ వరుస సినిమాలు కూడా విజయాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నితిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా రంగ్ దే షూటింగ్ జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం మాత్రమే ఇంకా షూటింగ్ మిగిలుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లకు అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కోసం రెండు పాటల్ని చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రొమాంటిక్ పాటలను చిత్రీకరించేందుకు ప్రస్తుతం చిత్రబృందం ఈనెల 25న ఇటలీ వెళ్లనుందట. ఇక ఈ రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తే పూర్తిగా సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందట. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news