చంద్ర‌బాబు నాయుడు కాదు.. ట్యాపింగ్ నాయుడు : వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

-

xఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెగాస‌స్ స్పైవేర్ వివాదం ముదురుతుంది. అధికార పార్టీ అయిన వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన టీడీపీ మ‌ధ్య విమ‌ర్శ‌లు పెగుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. టీడీపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజా గా అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్ నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చంద్ర‌బాబు నాయుడు కాదు… ట్యాపింగ్ నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు నాయుడు పెగాస‌స్ స్పైవేర్ ఎవ‌రి కోసం కొనుగోలు చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇత‌రుల ఫోన్ సంభాషణ‌లను దొంగ‌త‌నంగా విన‌డం నేరం అని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు పెగాస‌స్ కొనుగోలు చేయ‌కుంటే.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. చంద్ర‌బాబు పేరు ఎందుకు చెబుతుంద‌ని అని ప్ర‌శ్నించారు. ఈ పెగాస‌స్ కొనుగోలు పై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆయ‌న అన్నారు. ఇది కేవలం ఏపీ స‌మ‌స్య ఒక్క‌టే కాద‌ని ఆయ‌న అన్నారు. దేశ భ‌ద్ర‌తకు సంబంధించిన అంశంగా కేంద్ర ప్ర‌భుత్వం చూడాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news