NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్: TSPSC పేపర్ లీక్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయి…

-

TSPSC పేపర్ లీక్ విషయం ఇపుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన విధంగా చెప్పుకుంటూ పోతుంటే .. విపక్షాలు మాత్రం అధికార పార్టీనే పేపర్ లీక్ అవ్వడని ప్రధాన కారణం అంటూ వ్యాఖ్యలు చేస్తోంది. NSUI ప్రెసిడెంట్ బల్మురి వెంకట్ మాట్లాడుతూ పేపర్లను తమ స్వార్థం కోసం ప్రభుత్వమే లీక్ చేసింది అని నిన్న కామెంట్ చేశాడు.

ఈ పేపర్ లీక్ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ NSUI ప్రెసిడెంట్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విషయం తెలిసినప్పుడు కేటీఆర్ దీనికి కారణం కేవలం ఇద్దరు వ్యక్తులు అని చెప్పాడు. దీని వెనుక చాలా మంది ఉన్నారు. విచారణ బృందం చెప్పక ముందే ప్రతి ఒక విషయం కేటీఆర్ చెబుతున్నాడు. అతనికి ఈ విషయంతో సంబంధం లేకపోతే ఏ విధంగా ఈ విషయాలను చెబుతున్నాడు. ఇప్పటికే NSUI ద్వారా కోర్టు లో కేసు వేశాము. ఖచ్చితంగా ఈ కేసులో సంబంధం ఉన్న వారంతా బయటకు వస్తారు అంటూ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news