ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణెం.. ట్విస్ట్‌ ఇచ్చిన లక్ష్మీపార్వతి

-

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకంగా కేంద్రం 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో దీన్ని విడుదల చేయబోతున్నారు. అయితే, ఎన్టీఆర్
పేరుతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్ వచ్చి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమ అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి.. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు లక్ష్మీపార్వతి.ఎన్టీఆర్‌తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి.

NTR 100 Rs Coin: రూ.100నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. అధికారిక గెజిట్ విడుదల | NTR  100 Rs Coin: Official Gazette Released For NTR 100 Rs Coin bvn

ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.. కాగా, ఎన్టీఆర్ చిత్రం ఉన్న వంద రూపాయల నాణెంను ఈ నెల 28న విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయలు నాణాన్ని
రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొనగా.. ఇప్పుడు లక్ష్మీ పార్వతితో లేఖతో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరినట్టు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news