చంద్రబాబు కంటతడి పై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అది అరాచక పాలన !

-

వైసీపీ నాయకుల వ్యక్తిగత దూషణలు పై నిన్న ప్రెస్ మీట్ ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను ప్రతిపక్షాలతో పాటు ఆయన కుటుంబం కూడా తీవ్రంగా ఖండించంది. అయితే తాజాగా చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన పై టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

” నిన్న అసెంబ్లీ హాల్ లో జరిగిన ఘటన నన్ను చాలా కలచివేసింది. మహిళల పై వ్యక్తిగత దూషణలు చాలా దారుణం. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. వ్యక్తిగత దూషణలకి దిగితే అది అరాచక పాలన అవుతుంది. అలాంటి సంస్కృతి మనకు వద్దు. మన భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తును ఇచ్చేలా… రాజకీయ నాయకులు వ్యవహరించాలి. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.  స్త్రీని గౌరవించడం మన కల్చర్‌లో భాగం. మాట మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజాసమస్యలపై జరగాలి. కానీ వ్యక్తిగత దూషణలుగా వుండకూడదు. నేను చంద్రబాబునాయుడు కు చెందిన కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక తెలుగువాడిగా, దేశ పౌరునిగా మాట్లాడుతున్నాను. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారు అని ఆశిస్తున్నాను” అంటూ వైసీపీ పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news