త్వరలో బిజెపిలో చేరే వారి సంఖ్య పెరుగుతుంది – మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

-

చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తులా ఉమాలు టిఆర్ఎస్ పార్టీకి పోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

మునుగోడులో బిజెపి గెలుపు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులపై తప్పుడు ప్రచారం జరిగేలాగా కుట్ర జరుగుతుందన్నారు. బిజెపి గెలుపు కోసం కొండ విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి తో పాటు నేను పది రోజులుగా ఇక్కడే పనిచేస్తున్నామన్నారు తుల ఉమా. మాకు ఎలాంటి ఫోన్ రాలేదు, మాకు ఫోన్ వచ్చినా మేము వాటికి రెస్పాండ్ అవ్వడం, ప్రలోభాలకు లొంగేవాళ్ళం కాదన్నారు. త్వరలో బిజెపిలో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్నారు.

నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మంత్రులు, ఒకరు మంత్రి కొడుకు, ఒకరు మంత్రి అల్లుడు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం కావడంతో కేసీఆర్ ఈ చేరికల కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తండ్రి, కొడుకులు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బిజెపి గెలుపును ఆపలేరని.. తెలంగాణలో బిజెపి బలోపేతాన్ని అడ్డుకోలేరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news