BREAKING NEWS: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

-

ఓమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం, మాస్కులు తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పబ్లిక్ ఈవెంట్లలో భౌతిక దూరాన్ని తప్పని సరి చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచిస్తోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. మాస్కులు పెట్టుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చిరించింది.

coronavirus 8 high risk zones in telangana
 

ఇటీవల ఓమిక్రాన్, కరోనా పరిస్థితులపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా  జనాలు గుమికూడకుండా.. పండగల సమయంలో కఠిన ఆంక్షలు విధించాలని హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.ఇప్పటికే మధ్య ప్రదేశ్, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఓడిశా, హర్యానా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. నైట్ కర్ప్యూలు విధిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news