BREAKING : ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్ ల బదిలీలు

-

BREAKING : ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్ ల బదిలీలు అయ్యారు. రెండు రోజుల కిందట చేసిన బదిలీల్లో కొన్ని సవరణలు చేసిన జగన్ ప్రభుత్వం..8 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో చైర్మన్ & ఎమ్‌డీగా విజయానంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది జగన్‌ సర్కార్‌.

అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, SSA గా B. శ్రీనివాసరావు కు బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్య స్పెషల్ ఆఫీసర్ గా వెట్రిసల్వి కొనసాగించారు. కర్నూలు జిల్లా జేసీగా నారపురెడ్డి మౌర్య, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా వికాస్ మర్మత్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా డి. హరిత, బాపట్ల జిల్లా జేసీగా చామకూరి శ్రీధర్, ప్రకాశం జిల్లా జేసీగా కె. శ్రీనివాసులు నియామకం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news