Breaking : తెలంగాణలో మరో నోటిఫికేషన్‌ విడుదల..

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు తుది గ‌డువు జులై 11. ఆగ‌స్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల‌కు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

After TS Govt, municipalities, corporations to do 'realty business'

ఇదిలా ఉంటే.. గతంలో గ్రూప్-1, పోలీస్‌ శాఖతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. 8 సంవత్సారాలుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం.. ఎలాంటి రిక్రూట్‌మెంట్‌లు జరగకపోవడంతో ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లకు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల ముగిసిన గ్రూప్‌1 పోస్టుల కోసం రికార్డుల స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news