రైతు భరోసా కేంద్రాలో భారీ అవినీతి జరిగింది : నాదెండ్ల మనోహర్‌

-

మరోసారి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో రూ.6,300 కోట్ల భారీ అవినీతి జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు గింజ సరఫరా చేయడం నుంచి మళ్లీ గింజ కొనుగోలు చేసే వరకు రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనికోసం రూ.6,300 కోట్లు కేటాయించారని, అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యాలయాలుగా, దళారులకు కేంద్రాలుగా మారిపోయాయని విమర్శించారు నాదెండ్ల మనోహర్.

AP News: పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగతంగా..: నాదెండ్ల మనోహర్‌

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న భరోసా పూర్తిగా శూన్యమని పేర్కొన్న నాదెండ్ల మనోహర్.. న్యాయంగా రైతులకు దక్కాల్సిన రైతు భరోసా నిధులు సైతం కులాలు, ప్రాంతాలు, పార్టీల వారీగా విభజిస్తూ ఇస్తున్నారని మండిపడ్డారు. అక్కడ కూడా రైతులకు సరైన న్యాయం జరగడంలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రూ.6,300 కోట్ల రైతు భరోసా కేంద్రాల అవినీతిని బయటపెడతామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులకు అందని సేవలపై ఇంత భారీ మొత్తంలో నిధులు ఎందుకు ఖర్చు చేశారో కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news