ఓరి దేవుడా.. విశ్వక్​ సేన్​ హీరోయిన్​ అందాల ఆరబోత మామూలుగా లేదుగా!

-

విశ్వక్​ సేన్​ హీరోగా రూపొందిన ఓరి దేవుడా చిత్రంతో మిథిలా పాల్కర్​ టాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనుంది. కోలీవుడ్ సూపర్​ హిట్ మూవీ ఓ మై కడవులే కి రీమేక్​గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకీ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్​ను కూడా తాజాగా విడుదల చేసింది. అక్టోబర్​ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మిథిలా పాల్కర్​ గురించి తెలుసుకుందాం..

 

మురంబ అనే మరాఠీ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న మిథిలా పాల్కర్​ ఇప్పుడు టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తోంది.1993 జనవరి 12న ముంబయిలో జన్మించింది.బాంద్రాలోని ఎమ్​ఎమ్​కే కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్​ మాస్​ మీడియాలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసింది.

 

మజా హనీమూన్​(2014) అనే షార్ట్​ ఫిల్మ్​లో తొలిసారి నటించింది. 16వ ముంబయి ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఈ షార్ట్​ ఫిల్మ్​ను ప్రదర్శించారు. అనంతరం కట్టి బట్టీలో ఇమ్రాన్​ ఖాన్​ సోదరి పాత్రలో నటించంది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా మిథిలా నటనకు మంచి మార్కులు పడ్డాయి. మ్యాగీ, టాటా టీ, జొమాటో ప్రకటనల్లో మెరిసింది.

 

2017లో విడుదలైన మురంబతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటనకుగాను ఉత్తమ పరిచయ నాయిక(మరాఠీ)గా ఫిల్మ్​ఫేర్​ అవార్డును అందుకుంది. ఎ బేబీ సిట్టర్స్​ గైడ్​ టూ మాన్​స్టర్​ హంటింగ్​ అనే ఇంగ్లీష్​ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.

 

గర్ల్​ ఇన్​ ది సిటీ, లిటిల్​ థింగ్స్​, అఫీషియల్​ చుక్యగిరి వంటి వెబ్​సిరీస్​లోనూ నటించింది. మిథిలా పాల్కర్​కు ఇన్​స్టాలో 3.6 మిలియన్​ ఫాలోవర్స్​ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news