తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త… ఈనెల 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు

-

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది.    వానా కాలం దాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7000 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. పంట కోతలను బట్టి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2022-23 సీజన్ దాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్ లో 1.51 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్ కు రూ.2,060, సాధారణ రకానికి రూ. 2,040 గా మద్దతు ధర ఖరారు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news