పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేల్చి కోర్ట్.. పెరిగిన కష్టాలు !

-

పాకిస్తాన్ లో నిన్నటి నుండి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. మాజీ ప్రధాని మరియు క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఖ్యమైన నగరాలలో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే వాస్తవాలు వెలుగుచూసే వరకు ప్రజలకు నిజా నిజాలు మరియు ఇమ్రాన్ ఖాన్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కాగా ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ ను కోర్ట్ లో ప్రవేశ పెట్టగా తోశాఖానా కేసులో కోర్ట్ ఆయనను దోషిగా తేల్చింది. ఈయనపై అంతకు ముందు ప్రధానిగా ఉన్న సమయంలో విలువైన వస్తువులు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నట్లు తేలింది. కాగా అల్ ఖదీర్ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ కబాడీ ఉన్నాడు. దీనితో ఒకటి తర్వాత మరొకటి అభియోగాలు , నేరారోపణలు జరుగుతుండడంతో ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు పెరిగిపోతున్నాయి.

వీటిపై త్వరగా తాను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోలేకపోతే కఠినమైన శిక్షలు పడే ప్రమాదం ఉంది. మరి ఇమ్రాన్ ఖాన్ తరపున ఉన్న లాయర్లు, కుటుంబసభ్యులు మరియు మద్దతుదారులు ఏమి చేస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news