ఉగ్రవాదుకలు స్వర్గంగా పాక్.. తాజా నివేదికలో వెల్లడి

-

పాక్ నిజస్వరూపం మరోమారు బట్టబయలైంది. మరోమారు పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని తేలింది. తాగాగా యూఎస్ కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్( సీఆర్ఎస్) తన నివేదికలో వెల్లడించింది. దాదాపుగా 12 ఉగ్రవాద సంస్థలకు పాక్ నిలయంగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇందులో కొన్ని ఉగ్రవాద సంస్థలు 1980 నుంచి పాక్ లో ఆశ్రయం పొందుతున్నట్లు వెల్లడించింది. ఇందులో ఇండియాలో పలు దాడులకు పాల్పడ్డ ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నాయి. 2008లో ముంబై ఎటాక్స్ కు పాల్పడ్డ లష్కర్- ఈ- తోయిబా ఉగ్రసంస్థ కూడా ఉంది. వీటితో పాటు 2001 పార్లమెంట్ పై దాడులకు తెగబడ్డ జైష్ ఏ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నాయి. వీటితో పాటు లష్కరే జంఘ్వీ, అల్ ఖైదా, హిజ్బల్ ముజాహిద్ధీన్, హక్కానీ నెట్వర్క్, ఐసిస్ కోరాసన్ మొదలగు ఉగ్రవాద సంస్థలకు పాక్ కేంద్రంగా ఉందని నివేదిక తెలిపింది. నివేదిక ఉగ్రవాద సంస్థలను 5 కేటాగిరీలుగా విభజించింది. ఆప్గనిస్థాన్, కాశ్మీర్, ప్రపంచం, స్థానికంగా ఉండేవి, యాంటీ షీయాగా ఓరియన్ టెడ్ గా కార్యకలాపాలు చేసే ఉగ్రవాద సంస్థలుగా విభజించింది.

Read more RELATED
Recommended to you

Latest news