పూరీ కల పవన్‌ కల్యాణ్‌ తీరుస్తున్నాడా ?

-

పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కు హీరో దొరికాడు. ఎప్పటికైనా జణగణమన తీయాలన్నది పూరీ లక్ష్యం. మహేశ్‌ కోసం ఈ కథను రాసుకున్నాడు. ఆయన నో చెప్పడంతో.. ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇదే సినిమాను మరో స్టార్‌తో తీయడానికి రెడీ అవుతున్నాడు పూరీ.

పూరీ ప్రస్తుతం లైగర్‌ తీస్తున్నా..మనసు మరోవైపు జణగణమన గురించి ఆలోచిస్తూ వుంటుంది. సినిమా కథ నచ్చక మహేశ్‌ నో చెప్పాడు. తను రాసుకున్న కథకు పవన్‌ అయినా బాగానే వుంటాడన్న నమ్మకం పూరీలో కలిగింది. ఆమధ్య పవన్‌కు లైన్‌ చెబితే.. పుల్‌ స్క్రిప్ట్‌తో రమ్మన్నాడట పవన్‌.

పూరీ పవన్‌తో తీసిన బద్రితో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో మరో మూవీ రావడానికి పదేళ్లు పట్టింది. రెండో సినిమా కెమెరామేన్‌ గంగతో రాంబాబు అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంట్రవర్సీకి గురై..నష్టపోయిందిగానీ..ఇందులోని డైలాగ్స్‌.. కొన్ని సీన్స్‌ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే వుంటారు.

జణగణమనకు పూరీ ఓకె చెప్పినా.. ఇప్పట్లో ఇది తెరకెక్కడం కష్టం. పవన్‌ చేతిలో వున్న క్రిష్‌.. హరీష్‌ శంకర్‌.. అయ్యప్పనమ్‌ కోషియమ్‌ రీమేక్‌ పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. ఇంతలో రాజకీయాల పరిణామాలు మారకుండా వుండాలి. మరి పూరీ కలల ప్రాజెక్ట్‌ పవన్‌తో అయినా తీరుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news