ఈనెల 20వ తేదీన జగన్ ఇలాకలో పవన్ కళ్యాణ్ పర్యటన

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసింది.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈనెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news