సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

-

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి జనసేనాని పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా అన్న చిరంజీవి జోలికి రాకు నువ్వు. ఆయన అజాత శత్రువు. చిరంజీవి కాంగ్రెస్లో ఉంటారో వేరే పార్టీలో ఉంటారో ఆయన ఇష్టం. వైసీపీ కి మద్దతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడినైన నేను ఒక్క మాట మాట్లాడలేదు.సజ్జలగారు మీరు చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి’ అని పవన్ హెచ్చరించారు.నువ్వు మా అందరి ట్యాక్స్ సొమ్ము తింటున్నావు, ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని అన్నారు.

మెగాస్టార్ గారు పాలసీల గురించి బాగుంది అంటే ఆయన మంచివారు, కానీ జనసేనకు 5 కోట్లు విరాళం ఇవ్వగానే, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా ఏం చేయలేరు, సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు అని అన్నారు.వైసీపీ నాయకులు సింహాల్లా ఉన్నారా అద్దంలో మొహం చూసుకోండి గుంటనక్కల్లా ఉన్నారు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news