సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్

-

అగ్నిపధ్ విధానం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. భారత సాయుధ దళాల్లో 4 ఏళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపధ్ విధానం తీవ్ర హింసకు దారి తీస్తుంది. ఆర్మీ ఆశావాహులు నిరసనలకు దిగుతూ.. పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు ఓ రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనం అయ్యాయి.

రైల్వే స్టేషన్ కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందారు. మరి కొందరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరమని అన్నారు.

అగ్నీపధ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం పై చేపట్టిన ఈ నిరసన నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news