Pawan Vs Posani :ఆయ‌న నిజంగానే మెంట‌ల్ కృష్ణనే .. పోసానిపై నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Pawan Vs Posani :జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ పోసాని మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో జనసేన మహిళ నేత నిహారిక సంచ‌ల‌న‌ వ్యాక్య‌లు చేసింది. పోసాని కృష్ణ మురళి సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను మెంటల్ కృష్ణ నే తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. పోసానిని వెంట‌నే.. పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుంద‌ని మండిపడ్డారు.

తెలుగు చిత్ర సీమ‌ను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే.. పోసాని కృష్ణ మాత్రం.. అచ్చొసిన ఆంబోతులా అడ్డుప‌డుతున్నార‌నీ, ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న మెంటల్ కృష్ణలా ఉంద‌ని విరుచు పడింది. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై పోసాని అదే రీతిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా.

ఈ సందర్భంగా పోసాని కృష్ణ‌.. పవన్ కళ్యాణ్ ని వ్య‌క్తగ‌తంగా విమ‌ర్శించాడు. ఆయ‌న మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ పర్సనల్‌గా టార్గెట్ చేసారు. పోసాని వ్యాఖ్య‌ల‌పై పవన్ కళ్యాణ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఎక్కడ? ఎలా? మాట్లాడాలో తెలియదన్నారు ప‌వన్ పై పోసాని కామెంట్స్ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ కొంత మంది పోసానిపై హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

దీంతో పోసాని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను సైకోగా అభివర్ణించారు. చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు అసలు పోలికే లేదన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ను అదుపులోకి పెట్టుకోవాలంటూ చిరంజీవిని హెచ్చరించిన సంగతి తెలిసిందే . ఇలా మాట‌కు తోడై.. పోసాని, ప‌వ‌న్ ల మ‌ధ్య గొడ‌వ‌ల పీక్స్ కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news