ఇంకా తేలని తిరుపతి అభ్యర్ధి.. అమిత్ షాతో పవన్ భేటీ !

-

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన తారీకులు కూడా వచ్చేసినా ఇంకా జనసేన, బీజేపీ మధ్య ఎవరు పోటీ చేయాలి అనే అంశం మాత్రం కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా తో పవన్ భేటీ కానున్నారు అని చెబుతున్నారు. తిరుపతి అభ్యర్థి, తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.

అమిత్ షాతో భేటీ అనంతరం 5వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ శ్రేణులతో సంయుక్త సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమావేశంలో పోటీలో ఎవరు నిలబడతారు అనే అంశాన్ని పవన్ వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే బీజేపీ వాళ్లు తామే పోటీ చేస్తున్నామని  చెప్పుకుంటుండగా జనసేన వాళ్ళు తాము పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు. మరి చివరికి ఈ అవకాశం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news