పెద్దిరెడ్డి ఎఫెక్ట్: కుప్పం వదలని బాబు..ఆ సీన్ మారుతుందా?

-

మొత్తానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు కుప్పం అంటే బాబు అడ్డాగానే ఉంది. ఆయన కాలు పెట్టకపోయినా సరే కుప్పం ప్రజలు..బాబుని గెలిపించుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో కూడా బాబు అసలు కుప్పంలో కాలు పెట్టలేదు. అయినా సరే ప్రజలు ఆయన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. కానీ అక్కడ నుంచే సీన్ మొత్తం మారింది.

కుప్పంలో బాబుని దెబ్బకొట్టడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి పావులు కదపడం మొదలుపెట్టారు. మొదట పంచాయితీ ఎన్నికల్లో బాబుకు చుక్కలు చూపించారు. అనూహ్యంగా కుప్పం పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో బాబు కాస్త తేరుకున్నారు. కుప్పంలో కాలు పెట్టారు. రెండు రోజులు తిరిగారు. మళ్ళీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచేసింది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో.

దీంతో బాబుకు సీన్ అర్ధమైంది…కుప్పం వెళ్లకపోతే పరిస్తితులు తారుమారవుతాయని తెలుసుకుని, కుప్పం వెళ్లారు. అటు నారా లోకేష్ కూడా కుప్పంలో ప్రచారం చేశారు. అయినా సరే మున్సిపాలిటీలో వైసీపీ హవాని అపలేకపోయారు. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. దీంతో కుప్పంలో బాబు పని అయిపోయిందని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో బాబు అలెర్ట్ అయ్యారు. ఇక తరుచూ కుప్పం వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్యే అక్కడే సొంత ఇల్లు కూడా కట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా మరొకసారి కుప్పం వెళ్ళి ప్రజలని కలవాలని బాబు డిసైడ్ అయ్యారు. అక్కడ పార్టీ నాయకులని సమన్వయం చేసుకుని, ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేశారు. ప్రజల్లో ఉన్న నెగిటివ్‌ని తొలగించాలనే లక్ష్యంతో బాబు కుప్పం వెళ్లనున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లోపు కుప్పంలో పరిస్తితులని తమకు అనుకూలంగా మార్చుకోకపోతే..ఈ సారి బాబు పరిస్తితి అస్సామే.

Read more RELATED
Recommended to you

Latest news