చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు – మంత్రి పెద్దిరెడ్డి

-

తెలుగుదేశం పార్టీ అధినేతన నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పై చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని విజయవాడ నుంచి గుంటూరు కి మార్చడం జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో నేడు శుభ ముహూర్తంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. నియంత పాలన అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి గొప్ప పాలన ఎప్పుడు జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. తన 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఇంత గొప్ప కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజల అండదండతో సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news