సభ ఫెయిల్యూర్ కాలేదు.. బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయింది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు అన్నారు. సీఎం మాటలకు ఎవరు చప్పట్లు కూడా కొట్టలేదన్నారు. కెసిఆర్ వేషం, మాటలు అన్నీ తుపాకి రాముడివే నని ఏద్దేవా చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

బిఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ కాలేదని.. ఆ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిందని అన్నారు. ఇరుకు గల్లీలలో పెట్టుకునే ప్రజా సంగ్రామ సభలో ఎంతమంది ఉంటున్నారని ప్రశ్నించారు. కెసిఆర్, కేటీఆర్ లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రశాంత్ రెడ్డి. 8 ఏళ్లలో మోడీ దేశానికి ఏం చేశాడు? ఏం చేయబోతున్నాడో చెప్పుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news