పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

-

రాయచోటి మండలం చిన్న ముక్క పల్లి రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇరువురి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకలలో పాల్గొనేందుకు పుంగనూరు నుంచి వీరబల్లి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టి కింద పడిపోయింది.

ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలోఆయన వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి – మిథున్ రెడ్డి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news