నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. స్టంట్‌ వేసిన వైద్యులు

-

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయనని హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్య చికిత్స కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తారకరత్న ని తీసుకువచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్ధన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు.

మసీదు నుంచి వారు బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సోమసిల్లి పడిపోయారు. దీంతో తారకరత్నని ఆసుపత్రికి తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలిపారు టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారని, గుండెకు రక్తం వెళ్లే రక్తనాళాలలో బ్లాక్ ఉందని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం నిలకడగానే ఉందని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news