తిరుపతి జిల్లాలో పరువు హత్య..ఇంటర్ విద్యార్థిని హత్య !

-

తిరుపతి జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి రెడ్డివారి పల్లెకు చెందిన ఇంటర్ విద్యార్థిని మోహనకృష్ణ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రేమ విఫలమై జూలై 7వ తేదీ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్య గా నిర్థారణ అయింది. కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు కుటుంబ సభ్యులు. దీంతో కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు గ్రామస్తులు, పోలీసులు. తాజాగా, కేసును ఛాలెంజ్ తీసుకున్న చంద్రగిరి పోలీసులు… విచారణ కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news