చైనీస్ టార్చర్ ను పుస్తాకాల్లోనే చదవండి…. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేటీఆర్ ట్వీట్

-

దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడిపై భారంపడుతోంది. పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్, సీఎన్జీ ధరలు కూడా పెరుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పెట్రోల్ ధరలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ట్వీట్ చేశారు. 

చైనీస్ హింసను పుస్తకాల్లోనే చదవండి…వరసగా 14 రోజుల్లో 12 సార్లు పెట్రోల్ ధరలను పెంచారని… ఈ టార్చర్ చైనీస్ హింసను మించిపోయిందంటూ ట్విట్ చేశారు. ‘‘కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జీ ముడిచమురు ధరలు, ధరలను, సెస్సులను తగ్గించేందుకు పార్లమెంట్లో చర్చకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంధన ధరలను తగ్గించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కనీసం 30 శాతం సెస్సులను తగ్గించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణ 2015 నుంచి గడ ఏడేళ్ల కాలంగా వ్యాట్ పెంచలేదని… కొంతమంది రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలని ఎలా అడుగుతారని ఆయన ట్విట్ లో ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news