రైతులకు గుడ్‌న్యూస్‌.. అప్లై చేసుకోండి..

-

రైతులకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు రైతులు తమ కేవైసీని అప్‌లోడ్‌ చేసుకోకపోతే.. మరోసారి చేసుకునేందుకు అవకాశం కల్పిచింది. అయితే ఈ ఆప్షన్‌ను కొన్ని రోజుల నుంచి తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులకు ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే రైతులు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే కూర్చోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ది పొందుతున్న రైతులు అందరూ తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మే 31 వరకు ఉంది. ఈలోగా రైతులు కేవైసీ చేసుకోకపోతే కేంద్ర నుంచి వచ్చే డబ్బులు మిస్‌ చేసుకుంటారు.

PM Modi In Gujarat: PM Modi On 3-Day Gujarat Tour From Today Ahead Of State  Elections

ఈకేవైసీ చేయండిలా..
ఈకేవైసీ చేయాలనుకునే రైతులు ముందుగా https://www.pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందులో పైనే ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో రైతులు ఆధార్ నమోదు చేసిన తర్వాత సెర్చ్ చేయాలి. అక్కడ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ పూర్తవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news