పీఎం కిసాన్ నిధి స్కీమ్ కింద భార్యాభర్తలిద్దరికీ రూ.12 వేలు వస్తాయా..?

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కేంద్రం రైతుల కోసం కూడా స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఆ స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు.

farmers

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పథకంలో చేరిన రైతులు ప్రతి ఏడాది రూ.6 వేలు డబ్బులు వస్తాయి. అయితే ఇవే ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తూ ఉంటుంది. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందే రైతులు తప్పక ముఖ్యమైన విషయాలని తెలుసుకోవాలి.

ఫేక్ డాక్యుమెంట్స్ తో చాలా మంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులని పొందుతున్నారు. అలా ఫేక్ డాక్యుమెంట్స్ తో ఈ స్కీమ్ ద్వారా డబ్బుల్ని పొందుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిని మళ్ళీ వెనక్కి చెల్లించాల్సి వస్తుంది.

అలానే ప్రతి ఒక్క రైతులకు ఈ పథకం కింద డబ్బులు లభించవు. ట్యాక్స్ కట్టే వారికి ఈ స్కీమ్ వర్తించదు. అలానే భార్యాభర్తలు ఇద్దరికీ పొలం ఉంటే.. వారిలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వస్తాయి. అంతే కానీ ఇద్దరికీ డబ్బులు రావడం జరగదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news