నీరజ్ చోప్రా కు ప్రధాని మోదీ అభినందనలు

-

నీరజ్ చోప్రా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లోనూ అదే ధోరణి కొనసాగించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా.పురుషుల జావెలిన్ ఫైనల్స్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా 88.13 మీటర్లు విసిరి 4వ త్రోతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన నాల్గవ ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి ఈ ఘటన అందుకున్నాడు.

 

ఈ ఫీట్‌ సాధించేందుకు భారత్‌కు 24 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. నీరజ్ ఈ ఘనత సాధించడంపై అతడి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీరజ్ స్వగ్రామమైన హర్యానాలో పాణిపట్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు డాన్సులు వేశారు. మరోవైపు నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అతియున్నత అథ్లెట్ లలో నీరజ్ ఒకడని కీర్తించారు. భారత క్రీడల్లో ఇదో ప్రత్యేకమైన రోజు అని మోడీ పేర్కొన్నారు. భవిష్యత్తు టోర్నీల్లోనూ పథకాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news