ప్రధాని మోదీ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడలేదు – కే కేశవరావు

-

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడలేదని మండిపడ్డారు బిఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు. కెసిఆర్ ప్రభుత్వం పై కేంద్రం అసత్య ఆరోపణలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం పై మోదీ చేసిన ఆరోపణలు అసత్యాలు అని కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీనే సహకరించడం లేదని ఆరోపించారు కే కేశవరావు. ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహిస్తే కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శిస్తున్నారు కానీ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సీఎంగా ఉన్న మోడీ ఎన్నో అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరు అయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news