కొత్త రాజ్యసభ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశం..!

-

రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన బీజేపీ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయననే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సంభాషణ చాలా అద్భుతంగా జరిగింది. ప్రజా సేవకు సంబంధించివారి అభిప్రాయాలు, అభిరుచులు వినడం చాలా అద్భుతంగా ఉంది. ఇది విభిన్నమైన ఎంపీలతో ఉన్న బృందం. పార్లమెంటరీ కార్యకలాపాలను కచ్చితంగా పాటించేట్లు కృషి చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారిలో 45 మంది సభ్యులు బుధవారం ఉదయం రాజ్యసభ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

వీరిలో 36 మంది తొలిసారి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 61 మంది సభ్యులు రాజ్యసభకు ఇటీవల ఎన్నిక కాగా, వీరిలో 43 మంది తొలిసారి పెద్దలసభలో అడుగుపెడుతుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news