వైసీపీ అవినీతిపై ‘ఛార్జిషీట్‌’.. బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజున కర్ణాటక, తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. ఏపీలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మోదీ అనంతరం.. రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత మోదీ రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు రూపొందించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు.

‘ఒకప్పుడు గుజరాత్‌, కర్ణాటక, ఏపీల్లో పార్టీ పరిస్థితి ఒకేలా ఉండేది. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఇప్పుడు బాగా పటిష్ఠమైంది. కానీ ఏపీలో పరిస్థితి బాలేదు. రాష్ట్రంలో పార్టీ పటిష్ఠానికి అందరూ కృషి చేయాలి. మనకు మన పార్టీ ముఖ్యం’ అని మోదీ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news