హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్ భేటీ

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని సీజే నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. రెండు గంటలకు పైగా జస్టిస్ ఉజ్జల్ తో కేసీఆర్ భేటీ జరిగింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం మర్యాద పూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పలు పాలనాపరమైన, ఇతర అంశాలపై రెండు గంటలకుపైగా ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సీఎం వెంట సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news