నేడు ప్రధాని మోదీ “మన్ కీ బాత్”!

-

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశాన్ని ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. కరోనా‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, తీసుకుబోయే చర్యల గురించి మాట్లాడనున్నారు.

అలాగే భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణను కూడా ప్రస్తావించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ నెల 30 తో అన్ లాక్ డౌన్-1 ముగియబోతుంది.. దీంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారోనన్న ఉత్కంట అందరిలో మొదలైంది. కరోనా తీవ్రత దృష్ట్యా.. మళ్ళీ లాక్ డౌన్ దిశగా ప్రధాని ప్రసంగం ఉండబోతుందా.. లేక ఆర్థిక వ్యవహారాలు పరిగణంలోకి తీసుకొని మరిన్ని సడలింపులతో అన్ లాక్ డౌన్-2 గురించి ప్రసంగించబోతున్నారా అనే విషయాల్లో క్లారిటీ రావాలంటే… ప్రధాని ప్రసంగం వినాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news