తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కోవిడ్ పాజిటివ్..

-

దేశంలో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన తర్వాత కేసులు.. ఇప్పుడు క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అలాగే సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది.

గత రెండు రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఇక ఆ పరీక్షల్లో పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి హోమ్ ఐసోలేషన్ లో కి వెళ్లారు. అలాగే ఈ మధ్యకాలంలో కలిసిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కాగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే రెండుసార్లు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news