జ్యూవెలరీ షాపులో భారీ చోరీ.. గంటల వ్యవధిలో పట్టేసిన పోలీసులు  !

-

సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో చందు జైన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. 21.30 లక్షల విలువ చేసే 1219 గ్రాముల బంగారం, 302 గ్రాములు వెండి ఎత్తుకు వెళ్లారు దుండగులు. ఈ రోజు తెల్లవారు జామున 3.10 గంటలకు ఘటన జరిగింది. దుకాణం వెంటిలేటర్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు.

gold ornaments
gold ornaments

యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గంటల వ్యవధిలోనే చోరీ కేసుని చేధించారు షాపు యజమాని డ్రైవర్, అలాగే అతని స్నేహితులు ఈ దొంగతనం చేసినట్లు నిర్ధారించారు. చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను కూడా అరెస్టు చేశారు. రోజూ చూస్తున్న షాప్ కావడంతో ఎలా చోరీ చేయాలి, ఏ సమయంలో చోరీ చేస్తే ఇబ్బంది ఉండదు లాంటి అనేక విషయాలను డ్రైవర్ తన స్నేహితులతో చెప్పి ఈ ప్లాన్ చేసినట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news