జంట హ‌త్య‌ల కేసును ఛేదించిన పోలీసులు

-

ప్రకాశం జిల్లాలో ఈమ‌ధ్య కాలంలో జరిగిన జంట హత్యలు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. తొలుత జిల్లాలోని వృద్ధ దంప‌తులు హ‌త్య‌కు గురికాగా.. ఆ త‌రువాత త‌ల్లి కూతుళ్లు హ‌త్య‌కు గుర‌వ్వ‌డం సంచ‌ల‌న‌మే రేకెత్తించింది. ముఖ్యంగా టంగుటూరులోని జ్యూయ‌ల‌రీ షాపు వ్యాపారి జ‌లదంకి ర‌వికిషోర్ శ్రీ‌దేవి (43), కుమార్తె వెంక‌ట లేఖ‌న (21) డిసెంబ‌ర్ 03న జంట హ‌త్య‌ల‌కు గుర‌య్యారు.

టంగుటూరులో వీరు హ‌త్య అనంత‌రం బంగారం, న‌గ‌దు దోచుకుపోయారు. టోల్ ప్లాజా, ఒంగోలు, అద్దంకి మీదుగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. అక్క‌డి నుంచి మ‌హారాష్ట్ర ప్ర‌వేశించిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. నిందితుల‌ను గుర్తించేందుకు ఓఎస్డీ చౌడేశ్వ‌రీ ఆధ్వ‌ర్యంలో నాలుగు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు ఎస్పీ మ‌ల్లికా గార్గ్‌. తాజాగా డ‌బుల్ మ‌ర్డ‌ర్ కేసును చేదించారు పోలీసులు. నిందితులు పాత నేర‌స్తులు అయిన‌టువంటి కందుకూరు గ్రామానికి చెందిన శివ‌కోట‌య్య‌, కిషోర్‌లుగా గుర్తించారు. డిసెంబ‌ర్ 03న జంట హ‌త్య‌లు జ‌రగ‌డంతో తాజాగా విచార‌ణలో నిందితుల‌ను గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news