రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..

-

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడంగల్‌ లో మంగళవారం తెరాస  అధినేత అధ్యక్షతన  నిర్వహించే ‘ ప్రజా ఆశీర్వాద సభ ‘  సభను వ్యతిరేకిస్తూ…కేసీఆర్ ని ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమని రేవంత్‌ హెచ్చరించారు. కేసీఆర్ ను కొడంగల్‌ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్‌ ప్రకటించడంతో.. తెరాస నేడు ఈసీ కి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వీడియో సాక్ష్యలను సైతం సమర్పించింది. దీంతో స్పందించిన ఈసీ రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు.. రేవంత్‌ రెడ్డి 241, 188, 506, 511 సెక్షన్ల కింద కొడంగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news