తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడంగల్ లో మంగళవారం తెరాస అధినేత అధ్యక్షతన నిర్వహించే ‘ ప్రజా ఆశీర్వాద సభ ‘ సభను వ్యతిరేకిస్తూ…కేసీఆర్ ని ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ ను కొడంగల్ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో.. తెరాస నేడు ఈసీ కి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో సాక్ష్యలను సైతం సమర్పించింది. దీంతో స్పందించిన ఈసీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు.. రేవంత్ రెడ్డి 241, 188, 506, 511 సెక్షన్ల కింద కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అందుకే ఇండియా ని విడిచిపెట్టేస్తాం.. వాట్సాప్ షాకింగ్ డెసిషన్..!
అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాల్సి వస్తే కనుక మేము...
3వ రోజు బస్సు యాత్ర మొదలు.. క్లాక్ టవర్ సెంటర్లో ప్రసంగించనున్న గులాబీ బాస్ కేసీఆర్..!
కేసీఆర్ బస్సు యాత్రని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రెండవ రోజు బస్సు...
ఫోన్ ట్యాపింగ్ కేసు పై హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన..!
హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా...