ఏపీలో దారుణం.. రక్షించాల్సిన పోలీసే.. కామంతో రాక్షసుడిలా బాలికపై అత్యాచారం..

-

మానవత్వం అనే మాటకు విలువ లేకుండా పోయింది. ఆడ పిల్లలను ఇంటి నుంచి భయటకు పంపించాలంటేనే గుండెల్లో భయమేస్తోంది. బటయ సమాజంలోనే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే.. రక్షించాల్సిన పోలీసులు సైతం కామాంధులుగా మారుతున్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు అత్యాచార ఘటనలో నిందితులు మారారు. ఇప్పుడు మరో రక్షకభటుడు భక్షకభటుడిగా మారి.. ఓ మైనర్‌ బాలిక జీవితాన్ని బలితీసుకున్నాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుత్తి ప్రాంతానికి చెందిన రమేశ్ కానిస్టేబుల్. ఆయన భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్. ఈ దంపతులకు ఒక అమ్మాయి సంతానం. భార్య భర్తలిద్దరూ ఉద్యోగులే కావడంతో వీరి పాపను చూసుకునేందుకు గుత్తి ప్రాంతానికే చెందిన ఓ బాలికను పనికి తెచ్చి పెట్టుకున్నారు. కానిస్టేబుల్ రమేశ్ ఇంట్లోనే ఆ మైనర్ బాలిక ఉంటూ వారి కూతురి అలనాపాలన చూసుకుంటుంది. అయితే బాలికపై కానిస్టేబుల్ రమేశ్ కన్ను పడింది.

Uttar Pradesh: Govt school principal booked for raping woman in Amethi |  Uttar News – India TV

భార్య డ్యూటీకి వెళ్లినప్పుడు మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకున్నాడు. ఇలా ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భందాల్చగా కానిస్టేబుల్ రమేశ్ అబార్షన్ చేయించాడు.అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. బాలిక నిస్సాహాయ స్థితిని అలుసుగా చేసుకుని రమేశ్ చిత్ర హింసలకు గురి చేయడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చకపోతే లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి నరకం చూపించేవాడు. రోజురోజుకు అతడు ఆకృత్యాలు తీవ్రమవ్వడంతో బాలిక ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో తల్లిదండ్రులు బాలికతో కలిసి పోలీస్ ఉన్నతాధికారులను కలిసి కానిస్టేబుల్ రమేశ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై ఫోక్సో చట్టం కింద అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కానిస్టేబుల్
రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news